ఉస్మానియాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

byసూర్య | Mon, Oct 14, 2019, 01:57 PM

 ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్  అహంకారం  వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇకనైనా భేషజాలను విడనాడి సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ  కార్మికులను చర్చలకు ఆహ్వానించి, వారి  డిమాండ్లను వెంటనే పరిష్కరించి, సమ్మెకు ముగింపు పలకాలని ఏబీవీపీ  డిమాండ్  చేసింది.  విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించి విద్యాసంవత్సరానికి విఘాతం కలుగకుండా చూడాలని కోరింది. ఆర్టీసీ  కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే భాద్యత వహించి, వారి కుటుంబాలకు 50 లక్షల  చొప్పున ఎక్స్ గ్రేషియా  ప్రకటించాలని ఏబీవీపీ  రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ డిమాండ్ చేశారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM