byసూర్య | Mon, Oct 14, 2019, 01:57 PM
ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ అహంకారం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇకనైనా భేషజాలను విడనాడి సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించి, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించి, సమ్మెకు ముగింపు పలకాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించి విద్యాసంవత్సరానికి విఘాతం కలుగకుండా చూడాలని కోరింది. ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే భాద్యత వహించి, వారి కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ డిమాండ్ చేశారు.