byసూర్య | Mon, Oct 14, 2019, 12:51 PM
హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమరావతి రైలెక్కుతూ ... కాలుజారి యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఓ యువతి రైలెక్కుతూ ప్రమాదవశాత్తు పట్టాల మీద పడడంతో మృతి చెందింది. పుష్పిత షా అనే 20 ఏళ్ల యువతి విజయవాడలో చదువుకుంటోంది. సోమవారం ఉదయం అమరావతి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలుజారి ట్రైన్ కింద పడి మృతి చెందింది. మృత దేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.