byసూర్య | Mon, Oct 14, 2019, 12:58 AM
తనపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలుచేసే ముందు కేంద్రంలో అధికారంలో ఉన్నతమ పార్టీ ప్రభుత్వం రైళ్లను రైల్వే సంస్థలను ప్రైవేటీకరించే దిశగా అడుగులేస్తున్న విషయంపై వాస్తవం కాదా అని మండిపడ్డారు తెలంగాణ సిఎం కేసీఆర్. ఆర్టీసీ సమ్మెపై ఆయన ఈ రోజు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము ఆర్టీసీలోకి అద్దెబస్సులు తీసుకుని, పాక్షికంగా ప్రైవేటీకరించి అభివృద్ధి పరిచేందుకు సిద్ధమవుతుంటే విమర్శలు చేస్తూ, కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
బిజెపి పాలక ప్రభుత్వం ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా ప్రైవేటీకరించింది. రైళ్లను ప్రైవేటీకరిస్తున్నది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోలోనే చెప్పింది. అక్కడి వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’ విమర్శించారు.