byసూర్య | Sun, Oct 13, 2019, 07:43 PM
రాష్ట్ర విభజన తర్వాత మూటముల్లె సర్ధుకుని సొంత ప్రాంతానికి వెళ్లిపోవాలనుకునే లోపు సమయం పూర్తి కావటంతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి స్థిరపడాలని భావించినా, వెళ్లలేకపోయిన వారికి కేంద్ర సర్కారు ఓ శుభవార్తను చెప్పింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి స్థానికత కల్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ మెత్తంగా ఏడేళ్లకు పెంచుతున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోమ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ లో ప్రచురించింది. ఇటీవల జగన్ న్యూఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని కలసి చేసిన విజ్ఞప్తి మేరకు హోమ్ శాఖ ను స్థానికత గడువును పెంచాలని సూచించినట్టు సమాచారం.