byసూర్య | Sun, Oct 13, 2019, 04:10 PM
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఆశ్వీయుజ శుద్ధపూర్ణిమ రోజున కోజాగిరి పూర్ణిమ నిర్వహించనున్నారు. కోజాగిరి పూర్ణిమను పురస్కరించుకొని రాత్రి 10.05 నిముషాల నుంచి కోజాగిరి వ్రతం, క్షీర చంద్రదర్శనం ఉంటుందని పూజారులు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు.