byసూర్య | Sun, Oct 13, 2019, 03:54 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగిన నేపథ్యంలో కొద్దిరోజులుగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడిపిస్తున్న ప్రభుత్వం ఇక పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకంపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియామకానికి సంబంధించి ఆదివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.