byసూర్య | Sun, Oct 13, 2019, 03:20 PM
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అంటే నిప్పు రవ్వలు అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. పోరాడి హామీలను సాధించుకోవాలని సూచించారు. ఆంధ్రవాళ్లను తరిమికొట్టినట్టే, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన పాలకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల సమస్యలు కనపడటం లేదా అని ప్రశ్నించారు.