ప్రజా సమస్యలపై మంత్రి మల్లారెడ్డి సమావేశం

byసూర్య | Sun, Oct 13, 2019, 02:48 PM

హైదరాబాద్‌: క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి నేడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ వెంకటేష్‌, మంత్రి రాజశేఖర్‌ రెడ్డి, కమిషనర్‌ వాణి, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM