byసూర్య | Sun, Oct 13, 2019, 02:48 PM
హైదరాబాద్: క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి నేడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేష్, మంత్రి రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ వాణి, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు.