byసూర్య | Sun, Oct 13, 2019, 01:59 PM
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఇప్పుడు మంత్రులయ్యారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారు ఇప్పుడు మంత్రులై ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమ కాలంలో ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ అవన్నీ మరిచారన్నారు. రాయితీలు కల్పించి, బతుకులు మారుస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు బస్సులు అమ్ముతం, మిమ్ములను లాభాల్లోకి తీసుకుపోతాం అనడం సరికాదన్నారు. వెంటనే ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోదండరాం డిమాండ్ చేశారు.