byసూర్య | Sun, Oct 13, 2019, 12:07 PM
తెలంగాణ సీఎం కేసీఆర్ పతనం మొదలైందని, కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆర్టీసి జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమన్నారు. బతికుండి సాధించుకోవాలని, నిరాశకు గురి కావద్దన్నారు. సీఎం కేసీఆర్ కు ఆత్మ బలిదానాలు కోరడం అలవాటన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేలాది మంది ప్రాణాలు బలిగొన్నాడని, ఇప్పుడు ఆర్టీసి కార్మికుల బలిదానాలు కోరుతున్నాడన్నారు. సీఎం కేసీఆర్ కు బయపడేది లేదని, కార్మికులంతా సంయమనంతో ఉద్యమంలో పాల్గొనాలన్నారు.