byసూర్య | Sun, Oct 13, 2019, 11:54 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె ఇవాళ్టికి 9వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు ఇవాళ అన్ని డిపోల ముందు వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు వంటావార్పును చేపట్టనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట చేపట్టిన విషయం తెలిసిందే.