byసూర్య | Sun, Oct 13, 2019, 07:42 AM
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన మర్ల శ్రీరాములు, సైదమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. కాగా మూడో కూతురు గౌతమి(3) ఆడుకుంటూ వెళ్లి కేబుల్ వైరును లాగడంతో స్టాండ్ జరిగి టీవీ మీదపడింది. టీవీకి మంచానికి మధ్యలో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన గౌతమి కేకలు వేయడంతో ఇంటి బయట ఉన్న కుటుంబసభ్యులు చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే కన్నుమూసింది.