మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో కవలలకు జన్మనిచ్చింది

byసూర్య | Sat, Oct 12, 2019, 10:17 PM

మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. కరీంనగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం....భాద్రాచలంకు చెందిన రమాదేవి(52) అనే మహిళకు ముందు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు చేతికొచ్చాడని తల్లిదండ్రులు సంతోషిస్తున్న సమయంలో అతను ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కొడుకు మృతితో తీవ్ర విషాదంలో కూరుకుపోయన ఆ తల్లిదండ్రులు మళ్లీ సంతానం కావాలనుకున్నారు. ఆ దంపతులకు వయసు ఎక్కువ కావడంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలో కరీంనగర్ పట్టణంలోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలోని వైద్యురాలు పద్మజను కలిసి తమకు జరిగిన విషాదాన్ని, తమ మనసులోని కోరికను కూడా తెలియజేశారు. అయితే వైద్యురాలు పద్మజ ఐవీఎఫ్ విధానంలో రామవదేవి గర్భం దాల్చేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. దీంతో నెలలు నిండిన రమాదేవి శుక్రవారం ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో కవలలకు పుట్టడంతో ఆ దంపతులు ఆనందంతో వైద్యురాలికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM