byసూర్య | Sat, Oct 12, 2019, 10:17 PM
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. కరీంనగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం....భాద్రాచలంకు చెందిన రమాదేవి(52) అనే మహిళకు ముందు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు చేతికొచ్చాడని తల్లిదండ్రులు సంతోషిస్తున్న సమయంలో అతను ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కొడుకు మృతితో తీవ్ర విషాదంలో కూరుకుపోయన ఆ తల్లిదండ్రులు మళ్లీ సంతానం కావాలనుకున్నారు. ఆ దంపతులకు వయసు ఎక్కువ కావడంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలో కరీంనగర్ పట్టణంలోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలోని వైద్యురాలు పద్మజను కలిసి తమకు జరిగిన విషాదాన్ని, తమ మనసులోని కోరికను కూడా తెలియజేశారు. అయితే వైద్యురాలు పద్మజ ఐవీఎఫ్ విధానంలో రామవదేవి గర్భం దాల్చేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. దీంతో నెలలు నిండిన రమాదేవి శుక్రవారం ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో కవలలకు పుట్టడంతో ఆ దంపతులు ఆనందంతో వైద్యురాలికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.