byసూర్య | Sat, Oct 12, 2019, 09:06 PM
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చిరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదన్నారు. బీజేపీ ఆర్టీసి కార్మికుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిక పోతే కేసీఆర్ పాలనను స్థంభింప చేస్తామని హెచ్చిరించారు.