మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

byసూర్య | Sat, Oct 12, 2019, 07:25 PM

మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చెందిన మంగలి సురేష్ మనస్తాపానికి చెంది చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మంగలి సురేష్ 4 సంవత్సరాల క్రితం పాతూర్ గ్రామానికి చెందిన చింతల నాగలక్ష్మితో వివాహం జరిగిందన్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడని, గత కొంత కాలం నుండి వీరి ఇద్దరి మధ్య గొడవ కావడం, కుటుంబ కలహాలతో విరక్తి చెందాడని, చాలా సార్లు పంచాయతీ నిర్వహించిన ప్రయోజనం లేకపోవడంతో దసరా పండగకు వెళ్లిన నాగలక్ష్మిని తీసుకువద్దామని వెళ్లగా.. అక్కడ అత్త, మామ, భార్య, బావమరిది వారి బంధువులు నానా బూతులు తిట్టి కొట్టడం జరిగిందన్నారు. దీనితో మనస్తాపం చెంది గ్రామ శివారులో గల చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.


Latest News
 

తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ Fri, Mar 29, 2024, 01:03 PM
డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు Fri, Mar 29, 2024, 12:58 PM
నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి Fri, Mar 29, 2024, 12:55 PM
పోలింగ్ పై సిబ్బందికి అవగాహన తప్పనిసరి Fri, Mar 29, 2024, 12:54 PM
పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ Fri, Mar 29, 2024, 12:54 PM