byసూర్య | Sat, Oct 12, 2019, 06:45 PM
త్వరలో గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం గల్ఫ్ దేశాల్లో పర్యటించాలనే నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు అక్కడ ఇబ్బందులు పడుతూ ఉండాల్సిన అవసరం లేదని, తిరిగి తెలంగాణాకు వచ్చేయాలని వారికి పిలుపునిచ్చారు. తెలంగాణాలో పనులు పనులు దొరకకుండా ఉండే అవకాశమే లేదని, అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణాలో ఉపాధి అవకాశాల గురించి గల్ఫ్ వెళ్లి వివరించాలని కేసీఆర్ భావిస్తున్నారు.