కొనసాగుతున్న కార్మికుల రిలే దీక్షలు

byసూర్య | Sat, Oct 12, 2019, 04:32 PM

న్యాయమైన డిమాండ్ల సాధనకై నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు ఐఎఫ్ టీయూ అనుబంధ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ శనివారం దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీయూ రాష్ట్ర నాయకులు ఐ.కృష్ణ, ఈ.నరేష్, టి.రమేష్, ఎం.దుర్గన్న, జి.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM
నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM
స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM