byసూర్య | Sat, Oct 12, 2019, 04:13 PM
ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్ శనివారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. వారి వెంట టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగెం లక్ష్మన్ రావు, కరీంనగర్ ఎల్ఎండీ ఇర్రిగేషన్ ఉద్యోగుల యూనిట్ అధ్యక్షులు మామిడి రమేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, కార్యదర్శి సుదర్శన్, ఆలయ ఉద్యోగ నాయకులు హరికిషన్, తిరుపతి రావు, శ్రీరాములు, నటరాజ, నాగుల మహేష్, చంద్రశేఖర్, నూగురి నరేందర్ ఉన్నారు.