byసూర్య | Sat, Oct 12, 2019, 04:04 PM
బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కంటికి గాయమైంది. శనివారం హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా చేస్తున్న అతడిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో లక్ష్మణ్ కంటికి గాయమైంది. చికిత్స నిమిత్తం లక్ష్మణ్ ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.