దోమకొండలో ముగ్గురి దారుణ హత్య

byసూర్య | Sat, Oct 12, 2019, 03:39 PM

కామారెడ్డి జిల్లా దోమకొండలో దారుణం జరిగింది.  శివారులో ఇద్దరు కుమార్తెలతో సహా ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి, అనంతరం గొంతు కోసి హత్య చేసినట్లు  గుర్తించారు. మృతులు భిక్కనూర్​ మండలం జంగంపల్లికి చెందిన బందెల బాలయ్య, ఆయన కూతురు లత, తమ్ముడి కూతురు చందనగా  గుర్తించారు. ముందుగా వీరికి శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి, అనంతరం గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిన్న సాయంత్రం దోమకొండ అటవీ ప్రాంతానికి ద్విచక్ర వాహనాలపై బాలయ్య, అతని తమ్ముడు రవిలు తమ కుమార్తెలతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో రవి కనిపించకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవియే ఈ హత్యలు చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.


Latest News
 

24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM