byసూర్య | Sat, Oct 12, 2019, 03:30 PM
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పీజీ పరీక్షలు షెడ్యూలు శుక్రవారం విడుదల చేశారు అధికారులు. డిసెంబర్ 4 నుంచి 9 వరకు మొదటి సంవత్సరం, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహంచనున్నట్లు.. ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ఖమ్మం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సమ్మయ్య తెలిపారు. పరీక్ష ఫీజు పేపరుకు రూ.150 ఆన్లైన్లో చెల్లింబాలని చెప్పారు. దరఖాస్తు చివరి తేది ఈ నెల 25 వరకు అని ఇతర వివరాలకు 7382929607 అనే నెంబర్ను సంప్రదించగలని తెలిపారు.