సొంత గ్రామంలో పర్యటించిన మాజీ గవర్నర్

byసూర్య | Sat, Oct 12, 2019, 01:23 PM

మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు శనివారం తమ సొంత గ్రామంలో పర్యటించారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో పర్యటించిన ఆయన.. తమ సొంత గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామంలో పర్యటించిన అనంతరం తమ ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలాకాలం తర్వాత సొంత గ్రామానికి వచ్చిన విద్యాసాగర్ రావుకు గ్రామంలో సాదర స్వాగతం లభించింది. పలువురు చిన్ననాటి స్నేహితులతో పాటు.. బంధువులు, తెలిసినవారందరితో పలు అంశాలపై చర్చించారు విద్యాసాగర్ రావు.


Latest News
 

యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న ఐజిపి Fri, Mar 29, 2024, 10:32 AM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి...! Fri, Mar 29, 2024, 10:26 AM
కేసీఆర్ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి: విజయశాంతి Fri, Mar 29, 2024, 10:19 AM
జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM