byసూర్య | Sat, Oct 12, 2019, 01:23 PM
మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు శనివారం తమ సొంత గ్రామంలో పర్యటించారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో పర్యటించిన ఆయన.. తమ సొంత గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామంలో పర్యటించిన అనంతరం తమ ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలాకాలం తర్వాత సొంత గ్రామానికి వచ్చిన విద్యాసాగర్ రావుకు గ్రామంలో సాదర స్వాగతం లభించింది. పలువురు చిన్ననాటి స్నేహితులతో పాటు.. బంధువులు, తెలిసినవారందరితో పలు అంశాలపై చర్చించారు విద్యాసాగర్ రావు.