byసూర్య | Sat, Oct 12, 2019, 01:05 PM
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఈరోజిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. సమ్మెను ప్రజలు, ప్రయాణికులపై బలవంతంగా రుద్దారని విమర్శించారు. ఇకపై ఆర్టీసీ కొత్త దారిలో నడవబోతోందన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని అన్నారు. సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. చర్చల మధ్యలో నుంచి వెళ్లిపోయింది కార్మిక నేతలేనన్నారు. విపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. విపక్షాలను ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు.