byసూర్య | Sat, Oct 12, 2019, 12:21 PM
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు భరీసంఖ్యలోనే మెట్రోలో ప్రయాణిస్తున్నారు. కాగా.. ఈ రోజు పారడేస్ వద్ద మెట్రో ట్రైన్ మొరాయించింది. నాగోల్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో ప్రయాణించనున్న మెట్రో మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రైన్ లో సంభవించిన సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినట్టు ప్రయాణికులు తెలుపుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం, పండుగ సీజన్ కావడంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైన సంగతి తెలిసిందే.