byసూర్య | Sat, Oct 12, 2019, 12:13 PM
ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల దగ్గర కుటుంబ సభ్యులతో కార్మికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. బస్భవన్ దగ్గర కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్మికుల ఆందోళనకు పోలీసులు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కార్మికులు ఆందోళనకు సిద్ధమవడంతో బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర బంద్పై నేతలు చర్చించనున్నారు.