byసూర్య | Sat, Oct 12, 2019, 11:54 AM
మహబూబ్నగర్ : బెంగళూరు నుంచి మేడ్చల్ వస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. జడ్చర్లకు సమీపంలోని తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీరిలో డ్రైవర్ మృతి చెందగా, మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.