byసూర్య | Sat, Oct 12, 2019, 11:45 AM
హెచ్ఐసీసీలో రెండో రోజు జరుగుతున్న సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటీఆర్ మాట్లాడుతూ... తొలిసారి వరల్డ్ డిజైన్ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్లో జరగడం సంతోషంగా ఉందని అన్నారు. వరల్డ్ డిజైన్ కాంగ్రెస్ సదస్సు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.