byసూర్య | Sat, Oct 12, 2019, 09:12 AM
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. హైదరాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర బంద్ తేదీలపై జేఏసీ నాయకులు, విపక్ష నేతలు చర్చించనున్నారు. ఆర్టీసీని విలీనం చేయాలని, సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టికి ఎనిమిదో రోజుకు చేరుకుంది.