గవర్నర్ త‌మిళ సైకి ‘వీహెచ్’ ఆహ్వానం

byసూర్య | Fri, Oct 11, 2019, 06:58 PM

మాజీ ఎంపీ వి.హనుమంత‌రావు తెలంగాణ గవర్నర్ ని కలిసి తన ఇంట్లో జరుపుకునే సత్యనారాయణ వ్రతానికి రావాలని ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మీడీయాతో మాట్లాడుతూ.. హాజీపూర్ ఘటన గురుంచి గవర్నర్ కి వివరించినట్టు తెలిపారు. అదే కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వెంటనే పరామర్శిస్తారు. హాజీపూర్ బాధితుల్ని ఎందుకు పరామర్శించేలేదు కేసీఆర్ అని ప్రశ్నించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘటన, ఇంటర్మీడియెట్, ఆర్టీసీ సమ్మె గురించి చెప్పానన్నారు. ఆర్టీసీ సమ్మెతో నలుగురు ఉద్యోగులు చనిపోయారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. కొత్త గవర్నర్ వచ్చాక మాకు న్యాయం జరుగుతోందని ఆశ కలుగుతుందన్నారు. తాను చెప్పిన అన్ని అంశాల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.


 


Latest News
 

ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM
ఆపదలో అండగా మేముంటాం Fri, Apr 19, 2024, 03:30 PM