byసూర్య | Fri, Oct 11, 2019, 06:29 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అని టీజేఏస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. కేవలం ఆర్టీసీ కార్మికుల పక్షాన కలవడానికి బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పార్టీలు కార్మికుల ఉద్యమానికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఉద్యమానికి రాజకీయ పార్టీ ల ఉద్యమం తోడైతేనే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. కార్మికుల సమస్యల కంటె రాజకీయం ముఖ్యం కాదని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పూర్తి స్థాయిలో బీజేపీ మద్దతు ఇస్తుందని చెప్పారు.