byసూర్య | Fri, Oct 11, 2019, 06:28 PM
అంబర్పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆజాద్నగర్లో నివాసముంటున్న ఓ ముస్లిం మహిళను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి వయసు 23 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ కలహాల వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.