byసూర్య | Fri, Oct 11, 2019, 06:26 PM
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ ఎం) కింద రాష్ట్రానికి ఇస్తున్న నిధులను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో రెండు రోజుల పా టు జరుగుతున్న సెంట్రల్ కౌన్సి ల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స మావేశానికి తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి హాజరై ప్రసంగించా రు. ఈ సమావేశానికి కో చైర్మన్ గా ఆయన ఎంపికయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్యానికి మాత్రమే సాయం అందుతుందని, అలా కాకుండా సెకండరీ, టర్షరీ స్థాయిలో ఉన్న ఆసుపత్రులకు కూడా అవసరమైన నిధులు అందించాలని సమావేశంలో మంత్రి కోరారు. ఎన్హెచ్ఎం కింద సిబ్బందికి కూడా నిధులు పెంచాలని ఈటల కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాదనను గట్టిగా వినిపించిన మంత్రి, తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్ కి ఎక్కువ మద్దతు అందించాలని, ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో పనిచేస్తున్న వారందరికీ జీత భత్యాలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అయుష్మాన్ భారత్ యోజన పథకం కంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం చాలా మెరుగైనది అని ఢిల్లీ వేదికగా మరోసారి ఆయన తేల్చి చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ పధకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కేవలం 24 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరే అవకశం ఉందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 85 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సమావేశంలో వివరించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే చికిత్సల్లో అత్యధికంగా ఐదు లక్షలు మాత్రమే రోగులకు ఇస్తున్నారని, తెలంగాణలో ఉన్న ఆరోగ్యశ్రీ తో మూత్రపిండాలు, గుండె మార్పిడి చేస్తున్నామని దీనికి 13 లక్షల రూపాయలు వరకు ప్రభుత్వం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశం రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సమన్వయాన్ని పెంచాలని, సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు నేరుగా రాష్ట్రాలకు అందించేవిధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.