byసూర్య | Fri, Oct 11, 2019, 02:24 PM
మెదక్ పట్టణంలో మున్సిపల్ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ప్రత్యేక చొరవతో మెదక్ లో కోతుల బెడద నుండి రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మార్కెట్ వెళ్ళినా, దుకాణాలకు వెళ్ళినా చేతిలో బ్యాగ్ ఉంటే చాలు లాక్కుని పోతున్నాయని, ఇళ్లల్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలు తెలిపారు. కూరగాయల సంచుల మీద పడి లాక్కుపోతున్నాయని, కోతుల మధ్య గొడవ చూస్తే ఒక భయంకరమైన పోరు కనబడుతుందని, చిన్న పిల్లలు దుకాణాలకు కూడా వెళ్లడానికి భయపడుతున్నారని ప్రజలు తెలిపారు. దయచేసి కోతులు పట్టేవారిని పిలిచి, మెదక్ పట్టణంలో కోతులను పట్టించి, అటవీ ప్రాంతంలో వదిలి వేయాలని అధికారులను వేడుకుంటున్నారు.