byసూర్య | Fri, Oct 11, 2019, 01:35 PM
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో నేనే ముందున్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీలో సీనియర్ నేతగా తనకు మంచి పేరుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ పదవి అంటే ఓ బాధ్యత అని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో చెల్లదని, గులాబీ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మరన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలను భయపెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమని.. ఉత్తమ్ తో విభేదాలు కూడా అందులో భాగమేనన్నారు.