byసూర్య | Fri, Oct 11, 2019, 01:30 PM
జిల్లాలోని గోపాల్పేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సింగిల్విండో కార్యాలయ భవనం, దుకాణాల సముదాయాన్ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లోక్నాథ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సహాకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఏరువులతో వ్యవసాయం చేయాలి. రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు.