byసూర్య | Fri, Oct 11, 2019, 12:39 PM
తెలంగాణ ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబ కుట్ర పన్నుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు. హుజూర్ నగర్ లో గెలిచేందుకు టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ ప్రలోభాలకు పాల్పడటం పద్ధతి కాదన్నారు.