byసూర్య | Fri, Oct 11, 2019, 12:37 PM
వనపర్తి జిల్లాలోని గోపాల్పేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సింగిల్విండో దుకాణాల సముదాయాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని అయన అన్నారు. సహాకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఏరువులతో వ్యవసాయం చేయాలని, రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లోక్నాథ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి పాల్గొన్నారు.