byసూర్య | Fri, Oct 11, 2019, 12:26 PM
పుణె టెస్ట్: పుణె వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 175 బంతుల్లో విరాట్ 101 పరుగులు చేశాడు. కోహ్లీ తన పరుగుల్లో 16 ఫోర్లు కొట్టాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 26వ శతకం చేశాడు. ప్రస్తుతం భారత్ 116 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (116), రహానే (59) క్రీజులో ఉన్నారు.