byసూర్య | Fri, Oct 11, 2019, 12:22 PM
హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మేఘా ఛైర్మన్ పిచ్చిరెడ్డి ఇంటితో పాటు మేఘా కృష్ణారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లిహిల్స్లోని ఇద్దరి ఇళ్లలో ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మేఘా సంస్థ దేశంలో పలు భారీ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక భారీ కాంట్రాక్టులు చేపట్టింది.