byసూర్య | Fri, Oct 11, 2019, 11:40 AM
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 288 పాయింట్లు లాభపడి 38,178 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 11,321 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 70.91గా ఉంది. టాటా స్టీల్, యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, టాటా మోటార్స్, మారుతీ సుజుకి తదితర కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.