byసూర్య | Thu, Oct 10, 2019, 06:33 PM
తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ అశోక్ కుమార్ భువనగిరి బ్రిటన్లో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఎంబీఈ అవార్డుకు ఎంపికయ్యారు. అశోక్ చేపడుతున్న స్వచ్ఛంద కార్యక్రమాలు, తెలుగు ప్రజలకు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఎలిజబెత్-2 రాణి చేతుల మీదుగా అవార్డును స్వీకరించనున్నారు. అశోక్ తెలంగాణలోని హుజురాబాద్లో జన్మించారు. ఉత్తర వేల్స్లోని బాంగోర్లో పని చేస్తున్నారు. స్కాట్లాండ్ తెలుగు అసోసియేషన్ స్థాపకుడు ఆయనే.