byసూర్య | Thu, Oct 10, 2019, 06:23 PM
అలాయ్ బలాయ్ లాంటి కార్యక్రమాలు మానవ సంబంధాలను మరింత మెరుగుపరుస్తాయని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ 15 ఏళ్లుగా అలాయ్ బలాయ్ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. తెలంగాణకు గవర్నర్గా రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. మహిళలకు తెలంగాణలో ఎంతో గౌరవం ఇస్తారని..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలన్నీ తమిళనాడులోలాగే ఉన్నాయని చెప్పారు. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్ని పార్టీల నేతలకు, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.