byసూర్య | Thu, Oct 10, 2019, 06:01 PM
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చెన్నైలోని మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ను కలిశారు. ఐతే పార్టీ ఆఫీసులో ఆయన్ను కలవడంతో ఇరువురి భేటీపై జోరుగా చర్చ జరుగుతోంది.చెన్నైలోని MNM పార్టీ కార్యాలయంలో కమల్ హాసన్ను పీవీ సింధు కలిశారు. ఆయనతో కలిసి లంచ్ చేశారు.బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ గెలిచి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని పీవీ సింధూపై ప్రశంసలు కురిపించారు కమల్ హాసన్.