లంచం తీసుకుంటుండగా ఎసిబికి చిక్కిన చీఫ్ ఇంజనీర్‌

byసూర్య | Thu, Oct 10, 2019, 04:47 PM

తెలంగాణలో మరో లంచావతారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆనంద్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. థర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించిన పనుల బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి సీఈ ఆనంద్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల పన్నిన ఏసీబీ అధికారులు ఆనంద్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఈ ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 


 


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM