byసూర్య | Sun, Aug 25, 2019, 03:20 PM
హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. ముఖ్యంగా, గల్ఫ్ దేశాల నుంచి ఇక్కడికి వచ్చే కొందరు ప్రయాణికులు బంగారం అక్రమరవాణాకు పాల్పడడం పరిపాటిగా మారింది. తాజాగా, ఎయిర్ పోర్టు అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 26 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ విపణిలో రూ.1.12 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. సదరు ప్రయాణికుడు షార్జా నుంచి వచ్చినట్టు గుర్తించారు.