byసూర్య | Sun, Aug 25, 2019, 10:58 AM
జిల్లాలోని మంచాల మండలం ఆగపల్లి గేట్ సమీపంలో సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో హోంగార్డు ఐలయ్య(35) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐలయ్య ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.