byసూర్య | Sun, Aug 25, 2019, 10:31 AM
మేడ్చల్ మల్కాజ్గిరి: జిల్లాలోని బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోకో కోలా కంపెనీ వద్ద ఆగి వున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న యువకుడు మృతి చెందాడు. మృతుడు మియాపూర్కు చెందిన ఎన్ఎస్యూఐ నాయకుడిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.