byసూర్య | Sun, Aug 25, 2019, 10:07 AM
ఓ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అదే తరగతి బాలుడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నరసరావుపేట పట్టణంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు వెళ్లిన సమయంలో అదే తరగతికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు పంపామని పోలీసులు తెలిపారు.