byసూర్య | Sat, Aug 24, 2019, 02:58 PM
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గణేష్ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు తొలిసారి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గంగాహారతిని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు.సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన హోం మంత్రి మహమూద్అలీ, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్లు వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సచివాలయంలో సమీక్షించారు.