byసూర్య | Sat, Aug 24, 2019, 12:42 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈరోజు భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీవర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఈరోజు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది.